జాతీయంహోమ్

ఐర్లాండ్ నుంచి నడుస్తున్న ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్?

#CockrochJanataParty

రాజకీయాల్లో కొత్త దనం తీసుకువస్తామని చెబుతున్న కాంక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఐర్లాండ్ నుంచి నిర్వహిస్తున్న ఒక సోషల్ మీడియా ఎకౌంట్ పై ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది.

ముంబై పోలీసులకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఫిర్యాదు అందడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదుదారు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఆ ఖాతా ఐర్లాండ్ కేంద్రంగా నిర్వహించబడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ముంబై పోలీసులను కోరినట్లు సమాచారం.

ఇదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు నేపథ్యంలో సామాజిక మాధ్యమ ఖాతా నిర్వహణ, దాని మూలం, విదేశీ సంబంధాలు ఉన్నాయా లేదా అనే కోణాల్లో పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు ముంబై పోలీసులు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అలాగే సీజేపీ లేదా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నుంచి కూడా ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడలేదు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నందున వాటి నిజానిజాలు అధికారిక దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related posts

31న సీఎం చేతుల మీదుగా వెలిగొండ ప్రారంభోత్సవం

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

బంగారపు ఉంగరాలు ఇచ్చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

Satyam News

Leave a Comment