ముఖ్యంశాలుహోమ్

బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య

#Bangladesh

బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా హతమార్చారు. నర్సింగ్డీ నగరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల హిందూ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన సోమవారం అర్ధ రాత్రి చోటు చేసుకుంది.

అదే రోజున, బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారవేత్తను (ఆయన ఒక పత్రికకు యాక్టింగ్ ఎడిటర్ కూడా) గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చి హతమార్చిన ఘటన జరిగిన కొన్ని గంటల తరువాతే ఈ హత్య జరిగింది. బీడీన్యూస్24 (bdnews24) వార్తా పోర్టల్ కథనం ప్రకారం, మోని చక్రవర్తి అనే వ్యక్తిని సోమవారం రాత్రి 11 గంటలకు పాలాష్ ఉపజిలాలోని చార్సింధూర్ బజార్‌లో దాడి చేసి హత్య చేశారు.

పాలాష్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ (ఓసీ) షాహెద్ అల్ మామున్ తెలిపిన వివరాల ప్రకారం, మోని చక్రవర్తి షిబ్‌పూర్ ఉపజిలాలోని సాధర్‌చర్ యూనియన్‌కు చెందిన మదన్ ఠాకూర్ కుమారుడు. మోని చాలాకాలంగా చార్సింధూర్ బజార్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.

ఇటీవలి వారాల్లో హత్యకు గురైన మూడో హిందూ వ్యాపారవేత్త ఇతడే. సోమవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు స్థానికంగా తయారుచేసిన పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి అనంతరం మోని అక్కడికక్కడే కూలిపోయాడని వార్తాకథనంలో పేర్కొన్నారు.

స్థానికులు అతడిని వెంటనే పాలాష్ ఉపజిలా హెల్త్ కాంప్లెక్స్‌కు తరలించగా, అక్కడ వైద్యులు అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, నిందితులను గుర్తించి అరెస్టు చేయడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఓసీ షాహెద్ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సింగ్డీ సదర్ ఆసుపత్రి మోర్గ్‌కు తరలించారు. ఈ హత్య హిందూ సమాజానికి చెందిన వారిపై జరుగుతున్న హింసాత్మక ఘటనల పరంపరలో తాజా ఘటనగా మారింది.

ఇప్పటి వరకూ జరిగిన హిందువుల హత్యలు ఇవే…

సోమవారం రోజునే మరో ఘటనలో, ఖుల్నా డివిజన్‌లోని జెస్సోర్ జిల్లా కేశబ్పూర్ ఉపజిలా అరువా గ్రామానికి చెందిన 38 ఏళ్ల రాణా ప్రతాప్ బైరాగీని గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చి హతమార్చారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సుమారు 5:45 గంటలకు కపాలియా బజార్‌లో జరిగింది.

జనవరి 3న ఖోకన్ చంద్ర దాస్ (50) అనే వ్యక్తిని దారుణంగా కొట్టి, నరికి, ఆపై నిప్పంటించి చంపారు.

డిసెంబర్ 24న, రాజ్‌బారి పట్టణంలోని పాంగ్షా ఉపజిలాలో అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని అక్రమ వసూళ్ల ఆరోపణలతో జనాలు గుంపుగా దాడి చేసి హత్య చేశారు.

18న, మైమెన్సింగ్ నగరంలో దిపు చంద్ర దాస్ (25) అనే యువకుడిని మతదూషణ ఆరోపణలపై గుంపు హింసకు గురిచేసి, అతని మృతదేహాన్ని నిప్పంటించారు.

23న, చట్టోగ్రామ్ పరిసరాల్లోని రావోజన్ ప్రాంతంలో ఖతార్‌లో పని చేసే శుఖ్ షిల్ మరియు అనిల్ షిల్ అనే ఇద్దరి నివాస గృహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వారు సురక్షితంగా బయటపడగలిగారు.

Related posts

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా?

Satyam News

లిక్కర్ స్కామ్‌: ప్రైవేట్ జెట్లు….. జల్సాలు…. ఆఫ్రికాలో పెట్టుబడులు!

Satyam News

జోగి రమేష్… కబుర్లు ఆపి పోలీసులకు లొంగిపో…

Satyam News

ఫ్యాక్షన్ నుంచి ఫైటర్ జెట్ల దాకా…మారిన సీమ ఇమేజ్!

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

ఒక్క ప్రాజెక్టు..లక్ష ఉద్యోగాలు..లోకేష్ సంచలనం.!

Satyam News

Leave a Comment