ముఖ్యంశాలుహోమ్

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

బచ్చలికూర జోసఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రచారం చేసుకుంటున్న జగన్ పార్టీ మరి నేడు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటనకు ఎలాంటి వివరణ ఇస్తుంది? విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి రావణ్ సహచరురాలు గగన్‌ను కలిసి మాట్లాడారు.

తాము రావణ్ వెనకే ఉంటామని హామీ ఇచ్చారు.  మరి వారి పార్టీకి సంబంధం లేకపోతే గగన్ ను ఆయన ఎలా కలిశారు? ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అయింది. విమానాశ్రయంలోకి వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న రావణ్ సహచరురాలు గగన్‌ను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జగన్‌కు పరిచయం చేశారు.

గగన్‌ను గమనించిన జగన్ ముందుకు వెళ్లిన తర్వాత తిరిగి వెనక్కి వచ్చి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గగన్‌కు ధైర్యం చెప్పిన జగన్, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అతనికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

పార్టీ తనకు పూర్తి మద్దతుగా ఉంటుందని, అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని జగన్ పేర్కొన్నట్లు అక్కడ ఉన్న నాయకులు తెలిపారు. అంతేకాకుండా, పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ తో టచ్ లో ఉండాలని, ఏ సమస్య వచ్చినా ఆయనతో నేరుగా మాట్లాడవచ్చని జగన్ గగన్‌కు సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు గగన్‌తో మాట్లాడిన జగన్ ఆమెకి ధైర్యం నూరిపోసి అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

Related posts

అమెరికా టారిఫ్ జయశంకర్ సునిశిత వ్యాఖ్య

Satyam News

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News

పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రారంభం

Satyam News

నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ “నేనెవరు?” టైటిల్ లోగో లాంచ్

Satyam News

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

Satyam News

Leave a Comment