ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

#SocialMedia

నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ప్రకారం పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 400కు పైగా సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తించి నిలిపివేశారు. ఇవి కాక్రోచ్ పార్టీతో సమన్వయం చేసుకుంటూ తప్పుడు సమాచారం, దుష్ప్రచారం వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఖాతాల ద్వారా ముఖ్యంగా దేశ భద్రత, శాంతిభద్రతలు, ప్రజా పరిస్థితులకు సంబంధించిన అసత్య ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో గందరగోళం సృష్టించడం, ప్రజల్లో అపోహలు పెంచడం లక్ష్యంగా ఈ విదేశీ ఖాతాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. విదేశీ ఖాతాల నుంచి వచ్చే అసత్య సమాచారం, పుకార్లు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మకుండా అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రతి సమాచారాన్ని పరిశీలించకుండా పంచుకోవద్దని, తప్పుడు ప్రచారాలకు సహకరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Related posts

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత బీమా

Satyam News

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

ఒంటిమిట్టలో భక్తి వాతావరణంలో హరిధ్రా ఘటనం

Satyam News

Leave a Comment