హైదరాబాద్హోమ్

అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

శాసనసభ ప్రాంగణంలో.. తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో కలిసి గవర్నర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ముందుగా ముఖ్యమంత్రి తో కలిసి గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.

Related posts

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News

ఏపీ రోడ్లకు మహర్దశ… మూడేళ్లలో లక్షన్నర కోట్లు

Satyam News

ముద్రగడ ఔట్‌… రంగా కూతురితో వైసీపీ రాజకీయం..?

Satyam News

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

Leave a Comment