జాతీయంహోమ్

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

#Dharmastali

పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలో 300 కంటే ఎక్కువ శవాలను అక్రమంగా పాతిపెట్టారని సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు దేశ విదేశాల్లో చర్చకు దారితీయగా సంచలనం కలిగింది. ఆ ఆరోపణల వెనుక ఎలాంటి వాస్తవం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పరిశోధనలో వెల్లడి అయింది.

దాంతో శనివారం అతడిని SIT అరెస్ట్ చేసింది. అరెస్టయిన వ్యక్తి మండ్య జిల్లా చిన్నబಳ್ಳಿ గ్రామానికి చెందిన సి.ఎన్. చినయ్యగా పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు “ముసుగు ధరించిన భీమ”గా ప్రసిద్ధి చెందిన అతని అసలు రూపం కోర్టులో ముసుగు తొలగించడంతో బయటపడింది.

SIT అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, చినయ్య ధర్మస్థలి ఆలయం గురించి చేసిన ఆరోపణలు అబద్ధమని, చూపించిన సాక్ష్యాలు కూడా తప్పుడు అని దర్యాప్తులో తేలింది. చినయ్యపై ఇప్పటికే దొంగతనం, భార్యను వేధించడం, డబ్బు మోసాలు వంటి పలు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

చినయ్య తండ్రి నంజయ్య గ్రామ పంచాయతీలో శుభ్రతా కార్మికుడిగా పనిచేసేవారని, చినయ్య స్కూలు మధ్యలో వదిలేసి, చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని తర్వాత రెండో పెళ్లి కూడా చేసుకున్నట్లు రికార్డుల్లో వెల్లడైంది. అరెస్టుతో అతనికి లభిస్తున్న “విట్‌నెస్ ప్రొటెక్షన్ యాక్ట్” కింద రక్షణ రద్దు చేయబడింది.

సాక్షి హోదా పోగొట్టి, ఇప్పుడు SIT అతన్ని ఆరోపితుడిగా విచారించనుంది. ధర్మస్థలి ఆలయంపై తప్పుడు ప్రచారం చేసి భక్తుల్లో కలకలం రేపిన చినయ్యపై విచారణ కొనసాగుతోంది.

Related posts

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

Satyam News

AI గేట్‌ వే ఆఫ్‌ ఆసియాగా విశాఖ

Satyam News

హిందూ దేవాలయాలకు టిటిడి రాయితీలు

Satyam News

ఆగస్టు 7న ఓబిసి జాతీయ మహాసభకు రండి

Satyam News

హోర్మోజ్ జల సంధిలో నిరాటంకంగా సరకు రవాణా?

Satyam News

మతం మారిన వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు

Satyam News

Leave a Comment