ముఖ్యంశాలుహోమ్

చిట్యాల వద్ద ప్రమాదం: నలుగురు మృతి

#Accident

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక ఏడేళ్ల బాలుడు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాద సమయంలో కారు చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News

తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

Satyam News

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News

మానవత్వంపై కోలుకోలేని దెబ్బ: ఇజ్రాయిల్ వాడింది తెల్లభాస్వరం!

Satyam News

రోడ్డును ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

Leave a Comment