జాతీయంహోమ్

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

#Jailar

హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీతో జైలు అధికారిణి ప్రేమలో పడ్డ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్‌లో ఓ జైలు అధికారిణి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ మధ్య ప్రేమ వివాహంగా మారిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్, మాజీ ఖైదీ ధర్మేంద్ర సింగ్‌ను వివాహం చేసుకున్నారు.

ఇద్దరి పరిచయం జైలులోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫిరోజా ఖాతూన్ వారెంట్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో, 2007లో ఓ కార్పొరేటర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్ జైలులో ఉన్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసింది.

మే 5న మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాలో వీరి వివాహం జరిగింది. సామాజిక విమర్శలు ఎదురుకాకుండా ఉండేందుకు ధర్మేంద్ర సింగ్ తన పేరును వివాహ ఆహ్వాన పత్రికల్లో మార్చినట్లు సమాచారం. వివాహ కార్యక్రమం వేద మంత్రోచ్చారణల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.

ఈ వివాహానికి ఫిరోజా ఖాతూన్ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదని తెలుస్తోంది. ఆమె ముస్లిం మతస్తురాలు. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్‌బహదూర్ మిశ్రా, ఆయన భార్య వివాహంలో కన్యాదానం నిర్వహించారు. బజరంగ్ దళ్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వివాహం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. జైలు పరిచయం ప్రేమగా మారడం, మతాంతర వివాహం, కుటుంబాల స్పందన వంటి అంశాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related posts

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

అనంతబాబు కోసం దళితులకు జగన్‌ అన్యాయం.!

Satyam News

రూ. 84,000 కోట్ల పెట్టుబడులతో RMZ గ్రూప్‌

Satyam News

కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై సంచలన ఆరోపణలు

Satyam News

ముద్రగడ ఔట్‌… రంగా కూతురితో వైసీపీ రాజకీయం..?

Satyam News

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News

Leave a Comment