26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

చిలకలూరిపేట లో పల్స్ పోలియో

జాతీయ పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని చిలుకూరి శ్రీరామమూర్తి ఆసుపత్రిలో ప్రత్యేక పోలియో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా విచ్చేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన శిబిరాన్ని సందర్శించి, చిన్నారులు కోలా గీతాన్ష్, కోలా హేమచంద్రలకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, అందుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోందని కొనియాడారు. “ఈ రోజు వేసే చిన్న చుక్క, రేపటి పోలియో-రహిత భవిష్యత్తుకు పెద్ద భరోసా” అనే విషయాన్ని తల్లిదండ్రులంతా గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.

5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఎలాంటి వాయిదాలు వేయకుండా, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు సచివాలయం సిబ్బంది కొప్పిశెట్టి నాగలక్ష్మి, సి.హెచ్. మరియ కుమారి తదితరులు పాల్గొని చిన్నారులకు చుక్కల మందు వేశారు.

Related posts

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

అమెరికా ఆయిల్ దాహం: ఇరాన్‌లో మృతుల సంఖ్య 1145

Satyam News

ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ: దారుణ హత్య

Satyam News

వికారాబాద్ లో ఘనంగా పర్యావరణ దినోత్సవం

Satyam News

17 నుండి శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు

Satyam News

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

Satyam News

Leave a Comment