ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ అధికారిని వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన మహిళ

#crime

ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి గతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరూ కలిసి ఒక ఓయో హోటల్ గదికి వెళ్లారు.

ఆ సమయంలో సదరు మహిళ అధికారికి తెలియకుండా వారిద్దరి ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్‌లో రికార్డు చేసింది. ఆ వీడియోలను ఆసరాగా చేసుకుని సదరు మహిళ డబ్బులు ఇవ్వాలని లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టింది. అలా గత మూడేళ్లుగా ఆమె సదరు అధికారి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది.

ఇక భరించలేకపోయిన ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారి చివరకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న మహిళపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలైన మహిళపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు

Related posts

ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే ఊరుకోం

Satyam News

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌!

Satyam News

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ‘నకిలీ’ నోట్ల కలకలం

Satyam News

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News

Leave a Comment