25.2 C
Hyderabad
September 20, 2026
ఖమ్మంహోమ్

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

#Revanthreddy

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నుంచి మేడారం వెళ్లనున్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కావడంతో లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఖమ్మంలో జరిగే ఈ సభ సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు ఘన ముగింపుగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

నెల్లూరు తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన

Satyam News

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Satyam News

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ రద్దు

Satyam News

హోర్మోజ్ జల సంధిలో నిరాటంకంగా సరకు రవాణా?

Satyam News

బతుకమ్మ వేడుకలపై చిన్నచూపు ఏల?

Satyam News

పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై అధ్యయనం

Satyam News

Leave a Comment