తూర్పుగోదావరిహోమ్

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

#RapeVictim

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఐదేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన నేకూరి ఎలీసా (70) అనే వ్యక్తి ఒక రైతు వద్ద పొగాకు బ్యారెన్ లో క్యూరింగ్ పనుల కోసం యాదవోలు గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సాయంత్రం సమయంలో ఆడుకోవడానికి బ్యారెన్ వద్దకు వచ్చిన ఐదు సంవత్సరాల మైనర్ బాలికపై సదరు వృద్ధుడు కన్నేసి అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

బాలిక భయంతో గట్టిగా ఏడవడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధుడిని అడ్డుకున్నారు. నిందితుడి దారుణాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలైన మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు.

Related posts

ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం

Satyam News

అబద్ధం సుబ్బారెడ్డిది…. సాక్ష్యం ఫోటోలది

Satyam News

ఏపిలో ఐఏఎస్ లకు పోస్టింగ్ లు

Satyam News

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

Satyam News

కొడాలి నానిపై ఫిర్యాదు: ఈ సారి అరెస్టు తప్పదా!

Satyam News

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

Satyam News

Leave a Comment