ప్రత్యేకంహోమ్

కుక్కను కొట్టినందుకు పెళ్లి క్యాన్సిల్

#Marriage

ఒక అమ్మాయి జరగాల్సిన తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నది. వరకట్నం కోసమో, వరుడు మంచివాడు కాదనో, ప్రియుడు ఉన్నాడనో… కాదు. ఒక వెరైటీ కారణంతో ఆ అమ్మాయి తన పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఇంతకీ ఆ కారణం ఏమిటి? ఇది చదివి తెలుసుకోండి.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఖాగా కొత్వాలి ప్రాంతంలో జరిగింది. వరుడు ఫతేపూర్‌కు చెందిన సుమిత్ కేశర్వానీ కాగా వధువు కుటుంబం ప్రయాగ్‌రాజ్ కు చెందినది.

వధువు వైపు వారు, వరుడి వైపు వారు కూడా ఖాగా కొత్వాలి లో ఒక గెస్టు హౌస్ లో పెళ్లి తంతు జరిపించేందుకు చేరుకున్నారు. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో వధువు పెంపుడు కుక్క మొరగడంతో వరుడి తరఫు ఓ వ్యక్తి దానిని కొట్టాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

వధువు తన పెంపుడు కుక్కను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటూ ఎంతో ప్రేమతో పెంచుతోంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన కుక్కను వరుడి కుటుంబానికి చెందిన వారు కొట్టడం ఆమె భరించలేకపోయింది.

దాంతో జంతువుల పట్ల కనీస కరుణ, గౌరవం లేని వ్యక్తులతో జీవితం కొనసాగించడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒక నిరపరాధ జంతువును ఇంత క్రూరంగా హింసించిన వారు భవిష్యత్తులో తన పట్ల కూడా గౌరవంగా ప్రవర్తిస్తారనే నమ్మకం తనకు లేదని కుటుంబ సభ్యులకు తెలిపింది.

దీంతో ఆమె పెళ్లిని వెంటనే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినప్పటికీ, తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు వధువు నిరాకరించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు వధువు నిర్ణయాన్ని సమర్థిస్తూ స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి స్వభావాన్ని అతను జంతువులతో ఎలా ప్రవర్తిస్తాడనే దాని ద్వారా కూడా అంచనా వేయవచ్చని, జంతువులపై హింసను సహించకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెళ్లి జీవితంలో నమ్మకం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించే ఈ ఘటన వెలుగులోకి రావడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ ఘటన జంతువుల పట్ల మానవత్వం, కరుణ, బాధ్యత ఎంత అవసరమో గుర్తు చేస్తూ, వివాహ బంధంలో పరస్పర విలువలు కూడా కీలకమనే సందేశాన్ని అందిస్తోంది.

ఇరు కుటుంబాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్న నగదు, బహుమతులను తిరిగి ఇచ్చుకుని విడిపోయాయి.

Related posts

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

Satyam News

టీడీపీ నాయకుల్ని బహిష్కరించిన మత్స్యకారులు

Satyam News

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

తిరగబడ్డ ఒరిస్సా బస్సు

Satyam News

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

Leave a Comment