మహబూబ్ నగర్హోమ్

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

#SunithaReddyIPS

ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వనపర్తి జిల్లాలో అమల్లో కొనసాగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి చెప్పారు. ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎంసీసీ అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను  పాటించాలని, నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించం, ఉల్లంఘనలు జరిగితే వెంటనే  కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత, శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

గ్రహణం రోజున ముస్లింల ర్యాలీ…!

Satyam News

మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా

Satyam News

సంగీత సరస్వతి ఎస్. జానకి కన్నుమూత

Satyam News

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News

ఇందిరమ్మ ఇళ్లకు స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

Leave a Comment