నిజామాబాద్హోమ్

సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల పంపిణీ?

#Cash

నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన శాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించడానికి కెనరా బ్యాంక్ శాఖకు వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

సుమారు 2.08 లక్షల రూపాయల విలువైన 500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసే క్రమంలో, అవి నకిలీవని గుర్తించిన క్యాషియర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసుల విచారణలో శాయిలు ఆ డబ్బును తన కుమారుడు ఇచ్చాడని తెలిపారు.

అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల సమయంలో ఓ అభ్యర్థి ఈ నకిలీ నోట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ముఖ్యంగా, ఒక జాతీయ పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థికి సంబంధించిన అనుచరుల ద్వారా ఈ నగదు చలామణిలోకి వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సదరు అభ్యర్థి రాజకీయంగా కీలక నేత అయిన పి.శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం జరుగుతుండటంతో, ఈ కేసును త్రొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నకిలీ నోట్ల మూలాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Related posts

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

27న భద్రాచలం దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం

Satyam News

మావిగన్‌పై జగన్‌ కోరిక తీరాలంటే.. చంద్రబాబు మరో 3 సార్లు..!!

Satyam News

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

దాసరి నారాయణరావు ఒక ఇన్స్టిట్యూషన్

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

Leave a Comment