ప్రకాశంహోమ్

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన గోపిరెడ్డి కాశిరెడ్డి (65) ని ఈనెల 9వ తేదీన ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఇదేమిటి అని ప్రశ్నించిన కాశిరెడ్డిని ఇద్దరూ యువకులు ఇష్టానుసారంగా కొట్టి గాయపరిచారు.

తీవ్రంగా గాయపడ్డ కాశిరెడ్డిని గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతూ కాశిరెడ్డి మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

విషం ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

Satyam News

మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోండి

Satyam News

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam News

దక్షిణ్ ఎనర్జీ ప్రమాద బాధితులకు న్యాయం చేస్తాం

Satyam News

జె మో రె కు విషయ పరిజ్ఞానం లేదు

Satyam News

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

Satyam News

Leave a Comment