విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్బాబు యూనివర్సిటీ చాన్స్లర్ మంచు మోహన్బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్తో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్వో సతీశ్తో మోహన్బాబు ఫోన్లో మాట్లాడారని, మెసేజ్లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
previous post
next post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
