ముఖ్యంశాలుహోమ్

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

#secretariat

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన R-5 జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలోని సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు అప్పగించాలని అధికారులు ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ జోన్‌లో వేసిన లేఅవుట్లు మరియు చేసిన భూ పంపిణీ ప్రక్రియను ప్రస్తుత సీఆర్‌డీఏ రద్దు చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్‌కు R-5 జోన్ వల్ల తీవ్ర అంతరాయం కలుగుతుందని భావించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గతంలో ఈ జోన్ కింద ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపనుంది. R-5 జోన్‌లో స్థలాలు కేటాయించిన వారికి ఇతర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. రాజధాని అసలు ఆకృతి దెబ్బతినకుండా ఉండేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో భూముల వినియోగం మళ్లీ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే కొనసాగనుంది.

Related posts

13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఆవిరి

Satyam News

ఢిల్లీలో లోకేష్‌..టెన్షన్‌లో జగన్‌!

Satyam News

NEET, IIT-JEE 2026 సాధనకు డిజిటల్ మెటీరియల్ సిద్ధం!

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

బెంగళూర్‌ టు అనంతపురం… ఏపీకి భారీ కంపెనీల క్యూ

Satyam News

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

Satyam News

Leave a Comment