కోట్లాది మంది అభిమానులను తన ఆటతో ఉర్రూతలూగించి, క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్.. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు విచ్చేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు అంతే ఉత్సాహంతో స్వాగతం పలికారు. అక్కడ వారితో ముచ్చటిస్తున్న దృశ్యం ఎంతో ఆత్మీయంగా ఉంది. ఇక దేశీ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ, లోకేశ్ భుజంపై చేయి వేసి అంతలా విరగబడి నవ్వుతున్నారంటే.. లోకేశ్ ఎంతటి చమత్కారంతో పలకరించి ఉంటారో అర్థమవుతోంది!
ఏ వేడుకైనా సరే, అందరితో ఎంతో సరదాగా, ఆత్మీయంగా కలిసిపోవడం ఈ దంపతుల ప్రత్యేకత. కేవలం టీవీల్లో మ్యాచ్లు చూస్తూ కాలక్షేపం చేసే జగన్ లాంటి వారికి, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో లోకేశ్ కలిగి ఉన్న ఈ స్థాయి సాన్నిహిత్యం చూస్తే అసూయ కలగడం సహజమే. కానీ, ఒక నాయకుడికి ప్రపంచ స్థాయి ప్రముఖులతో ఇలాంటి సత్సంబంధాలు ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకు మరియు అభివృద్ధికి శుభసూచకం!
మంగళగిరిలో స్వామి వారి కళ్యాణమైనా, ముంబైలో అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ వివాహమైనా.. దంపతులు ఇద్దరూ కలిసి వెళ్లడం, మన సంస్కృతీ సంప్రదాయాలకు వారు ఇచ్చే గౌరవానికి నిదర్శనం. ఇలాంటి జంట అందరికీ ఆదర్శం!
