నెల్లూరుహోమ్

పేదల కల సాకారం.. రేపే ఏపీలో మహా గృహ సంబరం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. “ప్రతీ పేదవాడికి ఒక నీడ” ఉండాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, కేవలం 21 నెలల వ్యవధిలోనే 5.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది!

గతేడాది నవంబర్‌లో రాయచోటి వేదికగా 3 లక్షల ఇళ్లను అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రెండో విడతగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు చేయించబోతున్నారు.

వేదిక: పుదూరు (నాయుడుపేట మండలం), సూళ్లూరుపేట నియోజకవర్గం.

ముఖ్య అతిథి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

విశేషం: 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు, మరో 1.50 లక్షల గృహాలకు పేదలు యజమానులు అవుతున్నారు.

“ఇది కేవలం ఇళ్ల పంపిణీ కాదు.. పేదల ఆత్మగౌరవ ప్రతీక!” ఈ నినాదంతో రేపు రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.

Related posts

సారీ… నో… ఇండిగో ఫ్లయిట్స్ టుడే ఆల్సో….

Satyam News

కేసీఆర్ పై హరీష్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు

Satyam News

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News

జోధ్‌పూర్‌లో ఐసిస్ హ్యాండ్లర్ అరెస్ట్: ఏపీ పోలీసుల ఆపరేషన్

Satyam News

సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబుపై బదిలీ వేటు

Satyam News

విజ్ఞాన్ లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Satyam News

Leave a Comment