ముఖ్యంశాలుహోమ్

అరకు లోయ లో కనిపించిన భూమి

#Earthquake

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయతో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 11:31 గంటల సమయంలో సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కదిలిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతాలు ఒరిస్సా సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఇక్కడ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

Related posts

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

Satyam News

క్యూలైన్లలో భక్తులు  సంయమనం పాటించాలి

Satyam News

అక్రమ బొగ్గు మాఫియా పై ఈడీ దాడులు

Satyam News

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

Satyam News

ఫలక్‌నుమా వంతెన ప్రారంభానికి సిద్ధం

Satyam News

Leave a Comment