హైదరాబాద్హోమ్

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

#crime

కవాడీగూడాలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ భవనంలో ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భవనం నాలుగో అంతస్తులో మహిళపై నిందితుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే గాంధీనగర్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు గురైన మహిళను శ్వేతగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ఎవరు, హత్యకు గల కారణాలేమిటి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related posts

బంగ్లాదేశ్ ను కుదిపేసిన భూ కంపం

Satyam News

నత్త నడకన ఈ-సాక్ష్యం కేసుల అమ‌లు

Satyam News

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News

టీటీడీ కాలేజీల ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభం

Satyam News

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News

Leave a Comment