ముఖ్యంశాలుహోమ్

పాల‌మూరు యూనివ‌ర్సిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌..!

మహబూబ్‌నగర్‌లోని పాల‌మూరు యూనివ‌ర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి హాస్ట‌ల్ గ‌దిలో ఉరి వేసుకొని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటనతో విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు, వర్సిటీ వర్గాల కథనం ప్రకారం.. మృతి చెందిన కార్తీక్ పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన కోర్సుకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును కాలేజీలో సబ్మిట్ చేయటానికి అతడు యూనివర్సిటీకి వచ్చాడు. అయితే, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, అంతలోనే హాస్టల్ గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కార్తీక్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Related posts

విబి-జిఆర్ఏఎంజి ద్వారా శాశ్వ‌త ఆస్తుల క‌ల్ప‌న‌

Satyam News

మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

Satyam News

అంపశయ్యపై నుంచి అభివృద్ధి పథంలోకి…

Satyam News

అలనాటి నటిని పట్టించుకోని సినీ రంగం

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

గీతా కృష్ణపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Satyam News

Leave a Comment