చిత్తూరుహోమ్

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం డీప్ ఫేక్ సాంకేతికతతో అసభ్యకరమైన వీడియోలను సృష్టించి రాజకీయ వికృత క్రీడకు తెరలేపిందని పౌర సమాజం, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎదురవుతున్న ప్రజా ఆగ్రహం నుండి హిందువుల దృష్టిని మళ్లించేందుకే జగన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలోని సాంకేతిక లోపాలను నెటిజన్లు ఎండగడుతున్నారు.

ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చేటప్పుడు సదరు మహిళ కట్టుకున్న చీర రంగుకు, కారు ఎక్కేటప్పుడు ఉన్న రంగుకు పొంతన లేకపోవడం ఇది స్పష్టమైన మార్ఫింగ్ డీప్ ఫేక్ సృష్టేనని నిర్ధారిస్తోంది. ఇటువంటి నీచమైన కుట్రలకు పాల్పడటం వైసీపీ నైజానికి నిదర్శనమని, విదేశాల్లో ఉన్న ఫేక్ ఐడీల ద్వారా ఈ చెత్తను ప్రచారం చేయిస్తూ పేటీఎం బ్యాచ్‌తో లైకులు, షేర్లు కొట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

లడ్డూ అపవిత్రత వంటి మహాపాపం నుండి తప్పించుకోవడానికి ఇతరులపై బురద జల్లడం కోసమే ఇదంతా చేస్తున్నారని, అమాయక కార్యకర్తలను ఇటువంటి సైబర్ నేరాల్లోకి నెట్టి వారి జీవితాలను వైసీపీ నాయకత్వం బలి చేస్తోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related posts

గుప్పెడు గుండెకు… సింగరేణి గ‌ట్టి భరోసా!

Satyam News

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News

హార్వర్డ్‌ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత ఫైర్

Satyam News

రక్షణ రంగ నిపుణుడు మరూఫ్ రజా ఇక లేరు

Satyam News

Leave a Comment