ప్రత్యేకంహోమ్

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

#BalaSai

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతులను బలసాయి, పద్మగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట, ఆదివారం తమ నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

ఈ విషాద ఘటనలో ఐదు నెలల పసిబిడ్డ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారడం అందరినీ కలచివేస్తోంది. చిన్నారి భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

CRDA బిల్డింగ్ రెడీ… ఇక రాజధాని నిర్మాణం పరుగులు….!!

Satyam News

అల్లూరి జిల్లాలో ఎన్ కౌంటర్: 6 గురు హతం

Satyam News

మహిళల కోసం పథకాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా?

Satyam News

గూగుల్‌ డేటా సెంటర్‌తో  2 లక్షల ఉద్యోగాలు… ఇదీ అసలు లెక్క!

Satyam News

Leave a Comment