ప్రత్యేకంహోమ్

దంపతుల ఆత్మహత్య: అనాథగా 5 నెలల బిడ్డ

#BalaSai

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతులను బలసాయి, పద్మగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట, ఆదివారం తమ నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

ఈ విషాద ఘటనలో ఐదు నెలల పసిబిడ్డ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారడం అందరినీ కలచివేస్తోంది. చిన్నారి భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

గ్రీన్ ఎనర్జీలో ఏపీ గర్జన…సౌత్‌ ఇండియా నంబర్ 1!

Satyam News

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసిన వైసీపీ లీడర్

Satyam News

తప్పుకున్న పాకిస్తాన్ : వాట్ నెక్ట్స్ ?

Satyam News

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

Leave a Comment