26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

డ్రగ్స్ టెస్టుకు మేం సిద్ధం…మీరు సిద్ధమా?

#MaheshKumarGoud

తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశంపై మరోసారి వేడి చర్చలు మొదలయ్యాయి. మండలిలో జరిగిన చర్చల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ సమస్యపై ప్రతిపక్షాన్ని నిలదీస్తూ, “డ్రగ్స్ టెస్ట్‌కు సిద్ధమేనా?” అంటూ ప్రత్యక్ష సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను డ్రగ్స్ పరీక్షకు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కూడా డ్రగ్స్ టెస్ట్‌కు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఇంకా ముందుకెళ్లి, తమ పార్టీ బి-ఫారం ఇచ్చిన ప్రతి అభ్యర్థిని డ్రగ్స్ పరీక్షలకు హాజరుపరచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదే విధంగా ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను పరీక్షలకు తీసుకురాగలవా అని ప్రశ్నించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విస్తృతి పెరిగిందని, యువత మత్తుకు బానిస అయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

బ్రీత్ అనలైజర్ పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేసిన వారు, డ్రగ్ అనాలసిస్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. డ్రగ్స్ అంశం ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా కొన్ని పేర్లు ముందుకు వస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Related posts

వెలిగొండ జలసిరులు… అభివృద్ధికి రెక్కలు

Satyam News

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

క్యూలైన్లలో భక్తులు  సంయమనం పాటించాలి

Satyam News

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

Satyam News

Leave a Comment