ప్రత్యేకంహోమ్

కేరళలో ఫీజుల పెంపుపై విద్యార్ధుల నిరసన

#SFI

ప్రతిపాదిత ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కేరళలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. సహకార వృత్తిపర విద్యా అకాడమీ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో ఫీజులను పెంచే నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు కేరళ సచివాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఫీజుల పెంపు వల్ల విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్య మరింత అందుబాటులో లేకుండా పోతుందని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఆరోపించారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నిరసనకారులు సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బ్యారికేడ్ల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని, ఫీజుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో సచివాలయం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related posts

ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ స్టూడియో

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

జీ5లో రొమాంటిక్ డ్రామా ‘బ్యాండ్ మేళం’ 24 నుంచి స్ట్రీమింగ్

Satyam News

13 నుంచి న్యూఢిల్లీలో ఎస్‌జెఎఫ్‌ఐ జాతీయ మహాసభ

Satyam News

భక్తిశ్రద్ధలతో సత్యసాయి విద్యానికేతన్ బోనాల వేడుకలు

Satyam News

Leave a Comment