ప్రపంచంహోమ్

Corona virus: వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు?

#TulasiGabbard

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైనట్లు ఆరోపణలు ఉన్న చైనాలోని వుహాన్ పరిశోధనా సంస్థకు నిధులు సమీకరించింది అమెరికా అనే కఠోర వాస్తవం మరో మారు చర్చకు వస్తున్నది. అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న తులసీ గబార్డ్ మరొక్కమారు ఈ ఆరోపణలను చేశారు.

చైనాలోని Wuhan Institute of Virologyలో ప్రమాదకరమైన “గెయిన్-ఆఫ్-ఫంక్షన్” పరిశోధనలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులను అందించడంలో మాజీ వైద్య సలహాదారు ఆంథోనీ ఫౌచీ కీలక పాత్ర పోషించారని ఆమె ఆరోపించారు.

గబ్బార్డ్ విడుదల చేసిన పత్రాల ప్రకారం, ఫౌచీ నేతృత్వంలోని జాతీయ అలెర్జీ మరియు అంటువ్యాధుల సంస్థ ద్వారా వుహాన్ ప్రయోగశాలలో గబ్బిలాల కరోనా వైరస్‌లపై పరిశోధనలకు నిధులు అందించబడినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రయోగశాల నుంచి అనుకోకుండా లీక్ అయి ఉండొచ్చనే సిద్ధాంతాన్ని అణచివేయడానికి గూఢచారి వర్గాల్లోని కొందరు అధికారులతో కలిసి పనిచేశారని కూడా ఆమె ఆరోపించారు.

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్న గబ్బార్డ్, అమెరికా ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందన్నారు. మహమ్మారి మూలాలపై జరిగిన విచారణల్లో ప్రయోగశాల లీక్ సిద్ధాంతాన్ని సమర్థించిన విశ్లేషకులు ఒత్తిళ్లు, వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విజిల్‌బ్లోయర్లు వెల్లడించారని తెలిపారు.

అయితే ఈ ఆరోపణలపై ఫౌచీ గతంలోనే పలు సందర్భాల్లో స్పందించారు. కరోనా మూలాలపై వచ్చిన కుట్ర సిద్ధాంతాల కారణంగా తనకు, తన కుటుంబానికి బెదిరింపులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ 2025 జనవరిలో ఫౌచీకి ముందస్తు క్షమాభిక్ష మంజూరు చేశారు. ఆ నిర్ణయం ఎలాంటి తప్పిదాన్ని అంగీకరించినట్లు కాదని, రాజకీయ ప్రేరేపిత దర్యాప్తుల నుంచి రక్షణ కల్పించడానికేనని బైడెన్ స్పష్టం చేశారు.

ఇక డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫౌచీకి కల్పించిన ప్రభుత్వ భద్రతను ఉపసంహరించుకున్నారు. ఇదే సమయంలో గబ్బార్డ్ విడుదల చేసిన తాజా పత్రాలు కరోనా మహమ్మారి మూలాలపై అమెరికాలో రాజకీయ, శాస్త్రీయ చర్చలను మరింత వేడెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే గబ్బార్డ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై స్వతంత్ర ధృవీకరణ, అధికారిక న్యాయపరమైన నిర్ధారణ ఇంకా వెలువడాల్సి ఉందని గమనించాలి.

Related posts

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

Satyam News

రాఖీ పౌర్ణమి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా?

Satyam News

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

Satyam News

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

Leave a Comment