ఏఐ సదస్సు లో బాగంగా పీఎం మోడీని ఏఐసీసీ జాతీయ నేత రాహుల్ తీవ్రంగా విమర్శించడంపై బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీని ఉత్తరాంధ్ర విజయనగరం లో బీజేపీ నేతలు నిరసనలకు దిగారు. నగరంలో ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. నగరంలో కాంప్లెక్స్ వద్ద బాలాజీ నగర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆ పార్టీ ఫ్లెక్సీ లను బీజేపీ శ్రేణులు చించేశారు.
రాహుల్ గాంధీ, షర్మిల ఫోటోలున్న బ్యానర్లు ని నిప్పు పెట్టి దగ్ధం చేశారు. ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆధ్వర్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ డౌన్ డౌన్ అంటూ గట్టిగా కేకలు వేశారు. వ్యక్తులను విమర్శించొచ్చు గాని దేశాన్ని విమర్శిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వర్మ అన్నారు.
