తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మృతులను చౌడేశ్వరి నగర్కు చెందిన కృష్ణవేణి (85), కనకరత్నం (70)గా గుర్తించారు.
బాధితులు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు విడిచారు. బాధితులు కల్తీ పాలు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ పాలు తాగిన వారిలో చాలా మందికి కిడ్నీలు దెబ్బతింటున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అధికారులు, పాలను విక్రయించిన మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు
.
