26.3 C
Hyderabad
September 19, 2026
తూర్పుగోదావరిహోమ్

కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు పెను కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు వృద్ధులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. మృతులను చౌడేశ్వరి నగర్‌కు చెందిన కృష్ణవేణి (85), కనకరత్నం (70)గా గుర్తించారు.

బాధితులు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు విడిచారు. బాధితులు కల్తీ పాలు తాగడం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ పాలు తాగిన వారిలో చాలా మందికి కిడ్నీలు దెబ్బతింటున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన అధికారులు, పాలను విక్రయించిన మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు

.

Related posts

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

Satyam News

శ్రీలంక తీరంలో ఇరాన్‌ యుద్ధనౌకపై దాడి: 100 మంది మృతి?

Satyam News

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News

దేవ దేవుడితో రాజకీయాలు చేస్తున్న బొత్స

Satyam News

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

Leave a Comment