ప్రత్యేకంహోమ్

చమురు ఎగుమతులతో ఇరాన్ కు భారీ ఆదాయం

అమెరికా, ఇజ్రాయెల్‌లతో తీవ్ర ఉద్రిక్తతలు, దాడులు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ తన చమురు ఎగుమతుల ద్వారా భారీగా ఆదాయాన్ని గడిస్తోంది. ఫిబ్రవరిలో రోజుకు 115 మిలియన్ డాలర్లుగా ఉన్న ఇరాన్ చమురు ఆదాయం, మార్చి నాటికి 139 మిలియన్ డాలర్లకు (సుమారు ₹1,310 కోట్లు) చేరుకుందని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుత యుద్ధ వాతావరణం కారణంగా హోర్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటాయి. ఈ ధరల పెరుగుదల ఇరాన్‌కు వరంగా మారింది. దీనికి తోడు, సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురును విక్రయించేందుకు అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించడం కూడా ఇరాన్ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమైంది. గ్లోబల్ మార్కెట్‌లో చమురు కొరతను తగ్గించేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఇరాన్ తన వ్యూహాత్మక భౌగోళిక స్థితిని ఉపయోగించుకుంటూ హోర్ముజ్ జలసంధి ద్వారా తన ఎగుమతులను యధావిధిగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ రోజుకు సగటున 16 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తోంది. అయితే ఇదే సమయంలో ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇతర గల్ఫ్ దేశాలు రవాణా అడ్డంకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాల ఎగుమతులు గణనీయంగా పడిపోగా, ఇరాన్ మాత్రం అంతర్జాతీయ ధరల పెరుగుదల మరియు పెరిగిన డిమాండ్ వల్ల భారీ లాభాలను ఆర్జిస్తోంది.

Related posts

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

ప్రశ్న రావణ్ ముఠా వెనుక ఐఏఎస్ అధికారులు?

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న దురంధర్ 2

Satyam News

బంగ్లాదేశ్ ను కుదిపేసిన భూ కంపం

Satyam News

యుద్ధం ముగిసింది: త్వరలో మళ్లీ చర్చలు

Satyam News

Leave a Comment