గుంటూరుహోమ్

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులు సత్రం ప్రక్కన ఉన్న కత్వ చెరువు డ్రైనేజీ కాలువలో పట్టపగలు ఆక్రమణదారులు యదేచ్ఛగా నిర్మాణాలు (పిల్లర్స్) చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నరసరావుపేట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ, నాయకులు నల్లపాటి రామారావు ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ఉన్నత అధికారులను కోరారు.

రెండు రోజుల క్రితం ప్రజాసంఘాల నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట తాహసిల్దార్ కి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్యని కోరామన్నారు. ఐతే టీపీవో సాంబయ్య పనులు ఆపించామని తమకు చెప్పడం జరిగిందన్నారు. కానీ, ఇప్పటికీ యదేచ్చగా పట్టపగలు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులతో కుమ్మక్కైన సాంబయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్

Satyam News

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: డీజీపీ సీవీ ఆనంద్

Satyam News

ఈ సారి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు లేనట్లే

Satyam News

Leave a Comment