26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులు సత్రం ప్రక్కన ఉన్న కత్వ చెరువు డ్రైనేజీ కాలువలో పట్టపగలు ఆక్రమణదారులు యదేచ్ఛగా నిర్మాణాలు (పిల్లర్స్) చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నరసరావుపేట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ, నాయకులు నల్లపాటి రామారావు ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ఉన్నత అధికారులను కోరారు.

రెండు రోజుల క్రితం ప్రజాసంఘాల నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట తాహసిల్దార్ కి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్యని కోరామన్నారు. ఐతే టీపీవో సాంబయ్య పనులు ఆపించామని తమకు చెప్పడం జరిగిందన్నారు. కానీ, ఇప్పటికీ యదేచ్చగా పట్టపగలు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులతో కుమ్మక్కైన సాంబయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

కాకినాడలో స్పేస్‌ స్టేషన్‌…. హోప్‌ ఐలాండ్‌ నుంచి రాకెట్లు..!!

Satyam News

భార్యపై భర్త అమానుష దాడి

Satyam News

పాలపిట్ట దర్శనం శుభసూచకం

Satyam News

అమెరికా నౌకాదళంలో భారతీయ బాలిక

Satyam News

సిరి మీడియా అక్రమాలపై దాసరి కుమారుడి ఫిర్యాదు

Satyam News

పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి బండారు దత్తాత్రేయ

Satyam News

Leave a Comment