ప్రత్యేకంహోమ్

మనం మరింత బాధ్యత గా ఉండాలి

#RevanthReddy

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టినందుకు మంత్రులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అందరం కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేయలేని ఎన్నో పనులను, తమ ప్రజా ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వంపై గట్టి నమ్మకాన్ని కలిగించాయని, ఈ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని ఆయన విశ్లేషించారు. ప్రజలు తమపై ఉంచిన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సీఎం సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

Satyam News

పోలవరం లో డీ వాటరింగ్ ప్రారంభం

Satyam News

‘కాక్రోచ్’ రాజకీయ పార్టీ ఇప్పుడే కాదు….

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం

Satyam News

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News

Leave a Comment