బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ముదిరాజ్ బిడ్డగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను సంతరించుకున్న అందేమోహన్ కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవిని కట్ట పెట్టాల్సిందేనని షాద్ నగర్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు టి. సాయి వంశీ తెలిపారు.
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సాయి వంశీ పేరుకుంటూ అందె మోహన్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే వీళ్ళ పని శంకర్ వెంట నడిచారని ఎన్నో ప్రయాసలకు పోర్చుకొని కష్టనష్టాలను భరించి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెనుకబడిన వర్గాలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అందేమోహన్ కు అవకాశం కల్పించాలని యువజన కాంగ్రెస్ తరఫున తాము కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
