విశాఖపట్నంహోమ్

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

#NewBridge

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, క్రేన్ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్‌ను తొలగించే చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

నెదర్లాండ్స్ ను ఓడించి సూపర్ 8 కు భారత్

Satyam News

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్

Satyam News

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News

ఆందోల్ రైతులకు సింగూర్ నీళ్లిస్తారా? లేక నష్టపరిహారం చెల్లిస్తారా?

Satyam News

చౌమహల్లాలో సూఫీ మధురిమలు

Satyam News

ఎర్రకోటపై దాడిలో జైషేమొహ్మద్: యూఎన్ రిపోర్టు

Satyam News

Leave a Comment