విశాఖపట్నంహోమ్

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

#NewBridge

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, క్రేన్ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్‌ను తొలగించే చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

తెగబడి దాడులు చేస్తున్న ఇజ్రాయెల్

Satyam News

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News

కరివేపాకే కదా అని ఈజీగా తీసి పారేయద్దు

Satyam News

విమానయానంపై తీవ్ర ప్రభావం: తగ్గుతున్న విమాన సర్వీసులు

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా

Satyam News

Leave a Comment