విశాఖపట్నంహోమ్

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

#NewBridge

విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. గాజువాక నుంచి నగరం వైపు వెళ్తున్న భారీ కంటైనర్ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్ రోటరీ వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో అదుపు తప్పి బోల్తా పడింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ, క్రేన్ల సహాయంతో బోల్తా పడిన కంటైనర్‌ను తొలగించే చర్యలు చేపట్టారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

తాసిల్దార్ వేధింపులతో వీఆర్వో ఆత్మహత్యాయత్నం

Satyam News

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

Satyam News

బచ్చలికూర జోసఫ్ సన్నిహితురాలిని కలిసిన జగన్

Satyam News

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

అమెరికా లో అరకు కాఫీ… న్యూయార్క్ లో ఆనంద్ మహేంద్ర స్టోర్

Satyam News

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

Leave a Comment