అమెరికా న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్ లారెల్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావుకు ఎన్నారైలు మహేష్ తన్నీరు, నరసింహా రావు, భాస్కర్ పిన్న, రవీందర్ రావు, అమర్ గుండ, పరమేశ్ బీం రెడ్డి, చైతన్న చిట్టిమల్ల, వరప్రసాద్, చందు తాళ్ల, పూర్ణ బైరి, నర్సింహా రెడ్డి, దొంతిరెడ్డి, రజినీతో పాటు, పలువురు బీఆర్ఎస్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
మీట్ అండ్ గ్రీట్ లో తెలంగాణ సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి రికార్డులు సృష్టించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రతీ రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టడం వల్లే తెలంగాణ ప్రగతి సాధ్యమైందన్నారు. కానీ విజన్ లేని రేవంత్ పాలనతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం ఒక్క ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు సైతం భయపడుతున్నారన్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని హరీష్ రావు తేల్చిచెప్పారు.
