26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

#PakTerrorGroups

లష్కరే తోయిబా కమాండర్ ను జమ్మూ కాశ్మీర్ లో భద్రతాదళాలు మట్టుబెట్టాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో లష్కరే తోయిబా కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాకిర్ అహ్మద్ గనీ బుధవారం హతమయ్యాడు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

జూలై 3 నుంచి షోపియాన్ జిల్లా మీమందర్ ప్రాంతంలోని దట్టమైన పండ్ల తోటల్లో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నిఘా పరికరాల ద్వారా ఇద్దరు ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన అనంతరం పోలీసులు, సైన్యం, కేంద్ర రిజర్వు పోలీసు దళం సంయుక్తంగా ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. గత ఐదు రోజులుగా మధ్య మధ్యలో కాల్పులు కొనసాగగా, బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో జాకిర్ అహ్మద్ గనీ మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం, 26 ఏళ్ల జాకిర్ అహ్మద్ గనీ కుల్గాం జిల్లాలోని మోతల్‌హామా గ్రామానికి చెందినవాడు. 2023 సెప్టెంబర్ 27న పనిమీద ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అతడు లష్కరే తోయిబాకు అనుబంధంగా భావించే ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో చేరినట్లు దర్యాప్తులో తేలింది. అతనిపై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు నిబంధనల కింద కేసులు నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో మరో ఉగ్రవాది లతీఫ్ ఇంకా ప్రాంతంలో చిక్కుకుని ఉండవచ్చని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అతడి కోసం గాలింపు కొనసాగుతోంది. దట్టమైన తోటల మధ్య నుంచి తప్పించుకునే అవకాశాలను పూర్తిగా నిలువరించేందుకు అదనపు బలగాలను మోహరించి అన్ని మార్గాలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

షోపియాన్ జిల్లా దక్షిణ కాశ్మీర్‌ను మధ్య కాశ్మీర్‌తో పాటు పీర్ పంజాల్ పర్వత శ్రేణులతో అనుసంధానించే కీలక మార్గంగా ఉండటంతో భద్రతా పరంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Related posts

సింగపూర్ బయలుదేరిన మంత్రి లోకేష్

Satyam News

ఫుజైరా ఓడరేవు పై ఇరాన్ చావుదెబ్బ

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

Satyam News

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News

Leave a Comment