కడపహోమ్

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ,రాజంపేట జన సేన ఇంచార్జి అత్తిగారి దినేష్,ఆధ్వర్యం వహించగా జనసేన పార్ల మెంట్ ఇంచార్జి యల్ల టూరు శ్రీనివాసరాజు తో పాటు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ మాట్లాడుతూ డొనేషన్ లు తీసుకోకుండా, సినిమాల్లో నటించి ఆ డబ్బును ప్రజలకు వినియోగిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 26 వ తేదీ నుంచి జనసేన పార్టీ “ఉద్యమి ”సభ్యత్వం వలన కలిగే ప్రయో జనాలు,పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్య క్రమాల్లో ప్రాధాన్యత పై దిశ నిర్దేశం చేశారు.

Related posts

తిరుమలలో రెవిన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Satyam News

చరిత్రలో రథసప్తమి….. ప్రత్యేకత

Satyam News

ప్రభుత్వ బడుల్లో విద్య మరింత బలోపేతం

Satyam News

31 దేశాల కంపెనీలు.. లక్షన్నర ఉద్యోగాలు… ఏపీలో మెగా జాబ్‌ సెంటర్‌!

Satyam News

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

Satyam News

మొంథా తుఫాన్ నేపథ్యంలో సహకరించండి

Satyam News

Leave a Comment