25.2 C
Hyderabad
September 20, 2026
ఖమ్మంహోమ్

భూదాన్ భూ బాధితులకు నేడు పట్టాల పంపిణీ

#BhudanLand

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు నేడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జరిగిన కూల్చివేతల నేపథ్యంలో ప్రభుత్వం బాధితులకు ప్లాట్లు కేటాయించి ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నిర్మించిన దాదాపు 700 పేదల ఇళ్లను పది రోజుల క్రితం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించి బాధితులకు అండగా నిలిచి ధర్నాలు, నిరసనలు నిర్వహించాయి. కూల్చివేతలపై ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.

ఈ నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లు కోల్పోయిన వారిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్లాట్లు కేటాయించి ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కూల్చివేతలు జరిగిన ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పోలీసుల పహారా మధ్య శిధిలాలను తొలగిస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రోక్లైనర్లు, వందలాది ట్రాక్టర్లు, టిప్పర్ల సహాయంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. బాధితులకు పట్టాలు పంపిణీకి ముందుగా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

AI గేట్‌ వే ఆఫ్‌ ఆసియాగా విశాఖ

Satyam News

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News

దీపావళి సోమవారమా? మంగళవారమా?

Satyam News

‘అక్రమ నగదు’ వ్యవహారంలో న్యాయమూర్తి రాజీనామా

Satyam News

విశాఖ స్టీల్ ప్లాంట్‌ రికార్డ్‌… జనవరిలో భారీ లాభాలు

Satyam News

పులివెందుల వార్ 2: ఓటుకి వేల నోట్లు….!!

Satyam News

Leave a Comment