ఖమ్మంహోమ్

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

#Revanthreddy

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి 18న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం నుంచి మేడారం వెళ్లనున్నారు. శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ కావడంతో లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఖమ్మంలో జరిగే ఈ సభ సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు ఘన ముగింపుగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Related posts

అనితకి అండగా లోకేష్‌, పవన్‌…. గుడివాడ అమర్‌నాథ్‌ పరుగులు

Satyam News

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

సత్వర విచారణతో నేరాలకు చెక్ పెట్టవచ్చు

Satyam News

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News

మంత్రి శ్రీధర్ బాబుతో విక్టోరియా విప్ లీ టార్లామిస్ భేటీ

Satyam News

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News

Leave a Comment