ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

#NaraLokesh

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు.

షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.

రేపు ఉదయం పార్లమెంట్ భవనానికి వెళ్లనున్న ఆయన, అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన ప్రాజెక్టుల పురోగతిపై వారితో చర్చించే అవకాశం ఉంది.

తన పర్యటన ముగించుకుని రేపు అర్ధరాత్రికి లోకేష్ తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Related posts

రామాలయ నిధులు కొట్టేసింది విశ్వ హిందూ పరిషత్?

Satyam News

వైకాపా తీరు వల్ల మండలి చైర్మన్‌పై పెరిగిన ఒత్తిడి!

Satyam News

ప్యాలెస్ మారుతున్న జగన్: లోటస్‌పాండ్‌పై దండయాత్ర!

Satyam News

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

Satyam News

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

Satyam News

కేసీఆర్ పై హరీష్ రావు భావోద్వేగ వ్యాఖ్యలు

Satyam News

Leave a Comment