మహబూబ్ నగర్హోమ్

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

#JupallyKrishna Rao

తెలంగాణ రాష్ట్రంలో జలవివాదం మరోసారి రాజకీయ వేడి రాజేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

శ్రీశైలం రిజర్వాయర్‌లో కనిష్ట నీటి మట్టం 834 అడుగులు (254.2 మీటర్లు)కు చేరుకున్న తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని వినియోగిస్తోందని ఆయన విమర్శించారు.

ఈ విషయంపై పలు మార్లు విన్నవించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులు, కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీశైలం వద్ద వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. తమ హెచ్చరికల ఫలితంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని చెప్పారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి కేటాయింపుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాకు నష్టం కలిగితే రైతుల తరఫున ప్రభుత్వం పోరాడుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే మరింత తీవ్ర ఆందోళనలు చేపడతామని అన్నారు.

ఇప్పటికే ఇలాంటి అంశాలపై గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్ర హక్కుల విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు.

Related posts

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

Satyam News

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

Satyam News

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

రేవంత్ సర్కార్ పై బీజేపీ చార్జిషీట్

Satyam News

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Satyam News

ఈ గెలుపు నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది

Satyam News

Leave a Comment