ప్రపంచంహోమ్

యుద్ధ పరిస్థితి పై ప్రధాని మోడీ తో ట్రంప్ చర్చలు

#Modi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై చర్చించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తదుపరి పరిణామాల నేపథ్యంలో ఈ సంభాషణ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

అంతర్జాతీయ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) సురక్షితంగా, తెరిచి ఉంచాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ నిబద్ధతను చాటారు.

అమెరికా రాయబారి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంభాషణలో ట్రంప్ భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ “మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము” అని మోదీతో అన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఇంధన రంగంతో పాటు పలు రంగాల్లో భారీ ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.

Related posts

రాష్ట్రం లో వంట గ్యాస్ కొరత లేదు

Satyam News

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

అమరావతిలో మరో సంచలనం….

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

ఒంటిమిట్ట అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

Satyam News

Leave a Comment