సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

#AlluArjun

సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపినట్లు సమాచారం.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం కోర్టు అల్లు అర్జున్‌కు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరగగా, సంబంధిత అంశాలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. సోమవారం జరిగే విచారణలో అల్లు అర్జున్ హాజరై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.

Related posts

బస్సు సేవలకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు

Satyam News

డోన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

Satyam News

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు!

Satyam News

విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

మోడీ ట్రంప్ మధ్యలో ఎలాన్ మస్క్

Satyam News

Leave a Comment