సినిమాహోమ్

‘పుష్ప’ కేసులో అల్లూ అర్జున్ కు నోటీసులు

#AlluArjun

సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపినట్లు సమాచారం.

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం కోర్టు అల్లు అర్జున్‌కు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరగగా, సంబంధిత అంశాలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. సోమవారం జరిగే విచారణలో అల్లు అర్జున్ హాజరై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.

Related posts

సొంత చెల్లి గుర్తు లేదా..?? రాదా…?? జగన్‌..??

Satyam News

శ్రీవారి పాదసన్నిధిలో సీఎం చంద్రబాబు కుటుంబం

Satyam News

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

Leave a Comment