సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లూ అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సమన్లు పంపినట్లు సమాచారం.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడిన ఘటనపై నమోదైన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కోసం కోర్టు అల్లు అర్జున్కు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణలు జరగగా, సంబంధిత అంశాలపై కోర్టు విచారణ కొనసాగిస్తోంది. సోమవారం జరిగే విచారణలో అల్లు అర్జున్ హాజరై తన వాదనలు వినిపించే అవకాశం ఉంది.
