హైదరాబాద్హోమ్

నేపాల్ వరద విపత్తు: తెలంగాణ ప్రత్యేక సమన్వయం

#RevanthReddy

నేపాల్‌లో సంభవించిన వరద విపత్తు నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల ఆచూకీ, వారి సురక్షిత తరలింపు, అలాగే పార్థివదేహాల గుర్తింపు మరియు స్వదేశానికి తరలింపు అంశాలపై తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ పోలీసులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నారు.

భారత విదేశాంగ శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఆగస్టు 29న 449 మంది భారతీయులు టిబెట్ నుంచి నేపాల్‌కు చేరుకున్నారు. ఆగస్టు 30న మరో 397 మందిని ఈ మార్గం ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఈ జాబితాలో తెలంగాణకు చెందిన అల్లి ఐయిలేష్ పేరు, పాస్‌పోర్టు వివరాలు తెలంగాణ భవన్ వద్ద ఉన్న రికార్డులతో సరిపోలాయి. ఆయన ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సంప్రదింపుల్లో ఉన్నారని, ఈ రోజు రాత్రి సుమారు 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకునే అవకాశముందని కుటుంబ సభ్యులు తెలిపారు.

నేపాల్ ప్రభుత్వం మృతుల ఛాయాచిత్రాలు, ప్రాథమిక వివరాలను నేపాల్ పోలీసుల డిజాస్టర్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్, గోర్ఖా, తనహున్, నావల్పరాసీ తూర్పు, నావల్పరాసీ పశ్చిమ, కాఠ్మాండూ జిల్లాల్లో భద్రపరిచిన పార్థివదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

నేపాల్ పోలీసుల ప్రకారం, కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా గుర్తించగలిగిన సందర్భాల్లో డీఎన్‌ఏ పరీక్ష తప్పనిసరి కాదు. మృతుడితో బంధుత్వాన్ని నిర్ధారించే ఆధారాలపై పార్థివదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తారు. ప్రత్యక్ష గుర్తింపు సాధ్యం కాని సందర్భాల్లో తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు వంటి తొలి-స్థాయి బంధువుల డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను సరిపోల్చే ప్రక్రియ చేపడతారు. ఇందుకోసం బంధువులు తప్పనిసరిగా నేపాల్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేదని, స్వస్థలంలో సిద్ధం చేసిన డీఎన్‌ఏ ప్రొఫైల్‌ను సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఈ-మెయిల్ విధానాన్ని నేపాల్ పోలీసులు సిద్ధం చేస్తున్నారు.

పార్థివదేహాల గుర్తింపు, అప్పగింత మరియు స్వదేశానికి తరలింపునకు సంబంధించిన సమగ్ర విధివిధానాలను నేపాల్ అధికారులు ఖరారు చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నందున, పరీక్షలు చేయించుకునే ముందు లేదా గుర్తింపు కోసం నేపాల్‌కు ప్రయాణించే ముందు తెలంగాణ భవన్, భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి అవసరమైన సూచనలు పొందాలి.

ప్రతి కేసులో అధికారిక నిర్ధారణ పూర్తయిన తరువాతే సంబంధిత కుటుంబాలకు, ప్రజలకు తదుపరి సమాచారం తెలియజేయబడుతుంది.

Related posts

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News

దువ్వాడ, అనంతబాబు రీఎంట్రీ…. జగన్‌ యూటర్న్..??

Satyam News

జనవరిలో జాబ్‌ కేలండర్‌…. 2026లో ఉద్యోగాల పండుగ..

Satyam News

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

Satyam News

రూ.40 లక్షల నిధులతో ఆత్కూరు డ్రైన్

Satyam News

విజ్ఞాన్ లో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Satyam News

Leave a Comment