అనంతపురంహోమ్

భగవాన్ సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోడీ

#Modi

భగవాన్ సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నేడు పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు.

అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.

Related posts

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

ఏపీలో UAE ఫుడ్ క్లస్టర్…. రైతన్నలకు గ్లోబల్ మార్కెట్.!

Satyam News

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

Satyam News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News

మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ

Satyam News

Leave a Comment