ప్రత్యేకంహోమ్

దుబాయ్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా….

#DubaiFlight

ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. దుబాయ్ నుంచి బయలుదేరిన AI916D ప్రత్యేక విమానం నేడు ఉదయం 10:58 గంటలకు ఢిల్లీలోని Indira Gandhi International Airport కు సురక్షితంగా చేరుకుంది.

VT-EDC అనే విమానం ద్వారా మొత్తం 149 మంది ప్రయాణికులు ఢిల్లీకి చేరినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతీయ విమానయాన సంస్థ నిర్వహించిన తొలి స్వదేశ ప్రయాణికుల రక్షణ విమానం ఇదేనని పేర్కొన్నారు.

అదే విధంగా ఈరోజు తెల్లవారుజామున దుబాయ్‌లో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 143 మంది పైలట్లు, కేబిన్ సిబ్బంది AI918D విమానంలో సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో ఈ విమానాల నిర్వహణ కోసం ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ మరియు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

విమానాల సమన్వయం సాఫీగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మరిన్ని విమానాలను అనుమతులు లభించిన వెంటనే నిర్వహించేందుకు దుబాయ్ విమానాశ్రయ అధికారులు మరియు సంబంధిత సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.

Related posts

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

ములకలచెరువు ‘దొంగలు’ దొరుకుతారా?

Satyam News

జోగినపల్లి కి ఫ్లోరా శైని సెల్యూట్

Satyam News

ఇథనాల్ శాతాన్ని ఇప్పటిలో పెంచేదిలేదు…

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

ఇరాన్ పై యుద్ధంలో భారత్ రాయబారం?

Satyam News

Leave a Comment