జాతీయంహోమ్

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

#VarunGandhi

వరుణ్ గాంధీకి రాజకీయాల్లో మళ్లీ దశ తిరిగినట్లే కనిపిస్తున్నది. పిలిభిత్ మాజీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు భేటీ అయ్యే అవకాశం లభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో వరుణ్ గాంధీని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

ఆ ఎన్నికల్లో జితిన్ ప్రసాద్ను పిలిభిత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. 2019లో తన తల్లి మేనకా గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానంలో వరుణ్ గాంధీ విజయం సాధించారు. 2021లో జరిగిన లఖింపూర్ ఖేరి హింస ఘటనలో రైతుల మరణాలపై వరుణ్ గాంధీ చేసిన ట్వీట్లు బీజేపీ అసంతృప్తికి కారణమయ్యాయి.

ఆ తర్వాత నిరుద్యోగం, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ప్రభుత్వ ఉజ్వల పథకం లోపాలు, ఉచిత రేషన్ పథకం సమస్యలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, “ఉచిత రేషన్ సమస్యలకు పరిష్కారం కాదు” అని వ్యాఖ్యానించారు. “జై శ్రీరామ్”, “భారత్ మాతా కీ జై” నినాదాలు ప్రజల సమస్యలను పరిష్కరించవని కూడా అన్నారు.

అలాగే, గతంలో తన కజిన్ రాహుల్ గాంధీతో కలిసి కేదార్‌నాథ్‌లో దర్శనమిచ్చిన సందర్భంగా ఆయన కాంగ్రెస్‌లో చేరవచ్చనే ప్రచారం కూడా జరిగింది. అయితే అది ఆచరణలోకి రాలేదు. ఇప్పటి తాజా పరిణామాలతో వరుణ్ గాంధీ మళ్లీ బీజేపీ ప్రధాన ప్రవాహంలోకి వస్తారా అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

తన భార్య యామిని రాయ్ చౌధరి, కుమార్తె అనసూయ తో కలిసి ప్రధాని మోడీతో తీసుకున్న ఫోటోలను ఆయన ‘X’ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో అందరూ ఆనందంగా కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.

Related posts

మధిర లో ఘనంగా దసరా  ఉత్సవాలు

Satyam News

పేదలకు 6 లక్షల ఇళ్లు… బడ్జెట్‌లో భారీ కేటాయింపులు

Satyam News

గండికోట ఉత్సవాలలో ఏ రోజు ఏం జరుగుతుంది….?

Satyam News

రేప్ లు మర్డర్ల నుంచి గొడ్డలి ఫొటో వరకూ…

Satyam News

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

Leave a Comment