గుంటూరుహోమ్

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు

సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజాదర్బార్ లో తనను కలిసి ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు చేసిన విజ్ఞప్తి పట్ల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు.

వారికి అండగా నిలిచారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీ(APSP)లో హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లుగా(ARSI) 300 మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ 2014-19 మధ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అయితే కొన్ని సాంకేతిక కారణాలు, ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం పదోన్నతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసిన సిబ్బంది.. తమ సమస్య పరిష్కరించాలంటూ విన్నవించారు.

అండగా ఉంటామంటూ మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకుంటూ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలులో చొరవ చూపారు. పదోన్నతులు కల్పించి 300 మంది కుటుంబాల్లో ఆనందం నింపడం పట్ల ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

హానీ ట్రాప్ తో లేడీ “కేడీ” టోకరా….

Satyam News

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News

పుట్టింటి ప‌ట్టుచీర‌ల‌తో వ‌నిత‌ల సంతోషం

Satyam News

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌!

Satyam News

ముడి చమురు ధరలతో మార్కెట్లు పతనం

Satyam News

Leave a Comment