చిత్తూరుహోమ్

తిరుమలలో ఒక్క సారిగా భారీ వర్షం

#TirumalaRain

తిరుమల లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసి భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యాహ్నం వరకు ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు సాయంత్రానికి కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

ఆకస్మికంగా మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. తిరుమల బస్టాండ్ ప్రాంతం, క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, పలు వీధుల్లో వర్షపు నీరు చేరడంతో భక్తులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నెమ్మదించాయి.

గత కొన్ని రోజులుగా తిరుమలలో తీవ్ర ఉక్కపోత నెలకొనడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధిక ఉష్ణోగ్రతలు, గాలిలేమితో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

వర్షం కారణంగా ఆలయ పరిసరాల్లో చల్లని వాతావరణం నెలకొనడంతో కొండపై ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించాయి. పలువురు భక్తులు వర్షాన్ని ఆస్వాదిస్తూ గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంతాల్లో సందడి చేశారు. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో చర్యలు చేపట్టారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, వర్షం సమయంలో జారి పడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా సంచరించాలని సూచించారు.

Related posts

మోదీపై వైసీపీ ఎటాక్… కాంగ్రెస్ గూటికి జగన్..?

Satyam News

రూ. 2500 కోట్ల ఇసుక దందా….. తీగ లాగుతున్న ED!

Satyam News

వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడమే ధ్యేయం

Satyam News

మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించిన అమిత్ షా

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

ఘనంగా హైదరాబాద్ సిటీ పోలీసుల హోలీ వేడుకలు

Satyam News

Leave a Comment